|
|
by Suryaa Desk | Mon, Oct 20, 2025, 08:13 PM
టాలీవుడ్ యువ నటుడు సిద్దూ జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన 'తెలుసు కదా' చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న గొప్పగా విడుదల అయ్యింది. సెలబ్రిటీ స్టైలిస్ట్ నీరజ కోనా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి మరియు రాషి ఖన్నా మహిళా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో వైవా హర్ష ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు, మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదలైన మూడు రోజులలో వరల్డ్ వైడ్ గా 14.1 కోట్ల గ్రాస్ ని వాసులు చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. సినిమాటోగ్రాఫర్ గా జ్ఞాన శేఖర్ బాబా, ఎడిటర్ గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా మరియు కాస్ట్యూమ్ డిజైనర్ గా శీతల్ శర్మ ఉన్నారు. చార్ట్-టాపింగ్ మ్యూజిక్కి పేరుగాంచిన థమన్ ఎస్ సౌండ్ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించింది.
Latest News