|
|
by Suryaa Desk | Mon, Oct 20, 2025, 03:29 PM
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి 'నారీ నారీ నడుమ మురారి' అనే టైటిల్ను ఖరారు చేసారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి భారీ రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రంలో సంయుక్త మరియు సాక్షి మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు దివాళి సందర్భంగా ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయునున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. నారీ నారీ నడుమ మురారి అద్భుతమైన సాంకేతిక నిపుణుల బృందాన్ని కలిగి ఉంది. ఇందులో సంగీత స్వరకర్తగా విశాల్ చంద్ర శేఖర్, సినిమాటోగ్రాఫర్గా జ్ఞాన శేఖర్ VS మరియు కళా దర్శకుడిగా బ్రహ్మ కడలి ఉన్నారు. భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు సమకూర్చారు. అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కి విశాల్ చంద్రశేఖర్ సౌండ్ట్రాక్ అందించనున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి అనిల్ సుంకర యొక్క ఎకె ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మించారు.
Latest News