|
|
by Suryaa Desk | Mon, Oct 20, 2025, 03:11 PM
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒక చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ రాబోయే ఎంటర్టైనర్ కి మూవీ మేకర్స్ ''ది గర్ల్ఫ్రెండ్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇప్పుడు అందరి అందరి దృష్టి ఈ చిత్రం పై ఉంది. దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం నవంబర్ 7, 2025న పెద్ద స్క్రీన్లపైకి రానుంది. ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ ని మూవీ మేకర్స్ ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈరోజు దివాళి సందర్భంగా ప్రముఖ సింగర్ చిన్మయితో ది దివాళి డేట్ అనే స్పెషల్ ఇనేటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో ప్రసారానికి అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్ మరియు ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మించగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.
Latest News