|
|
by Suryaa Desk | Sat, Oct 18, 2025, 04:04 PM
యువ దర్శకుడు కీర్తిస్వారాన్ దర్శకత్వంలో కోలీవుడ్ యువ నటుడు-దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించిన 'డ్యూడ్' చిత్రం అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిశ్రమ సమీక్షలని అందుకుంటుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద తొలి రోజు 22 కోట్లు వాసులు చేసింది. ఈ తెలుగు తమిళ ద్విభాషా చిత్రంలో మామిత బైజు మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సీనియర్ నటులు శరత్ కుమార్, రోహిని మొల్లెటి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని ప్రత్యంగిరా సినిమాస్ బ్యానర్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు, మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క నార్త్ అమెరికా గ్రాస్ $300K మార్క్ కి చేరుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రాన్ని మైథ్రీ మూవీ మేకర్స్ బ్యానర్ క్రింద నిర్మిస్తున్నారు. సాయి భాంక్కర్ ఈ చిత్ర సంగీత స్వరకర్తగా ఉన్నారు.
Latest News