|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 04:38 PM
చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన 37వ చిత్రాన్ని సమాజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'నారీ నారీ నడుమ మురారి' అనే టైటిల్ను ఖరారు చేసారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రంలో సంయుక్త మరియు సాక్షి మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సంగీత స్వరకర్తగా విశాల్ చంద్ర శేఖర్, సినిమాటోగ్రాఫర్గా జ్ఞాన శేఖర్ VS మరియు కళా దర్శకుడిగా బ్రహ్మ కడలి ఉన్నారు. భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు సమకూర్చారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమా యొక్క విడుదల తేదీని మేకర్స్ దీవాలి సందర్భంగా ప్రకటించటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి అనిల్ సుంకర యొక్క ఎకె ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మించారు.
Latest News