|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 07:17 PM
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రాబోయే చిత్రం 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రానికి అనిల్ రవిపుడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం యొక్క ఆడియో రైట్స్ ని టి సిరీస్ సొంతం చేసుకుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ప్రోమోని మీసాల పిల్ల అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ సాంగ్ కి ఉదిత్ నారాయణ తన గాత్రాణి అందించారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ ప్రోమో 15 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ మ్యూజిక్ లో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. నయనతార మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, వెంకటేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సుష్మిత కొణిదెల యొక్క గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సహకారంతో బిగ్గీని షైన్ స్క్రీన్స్ బ్యానర్లో సాహు గారపాటి నిర్మిస్తున్నారు మరియు సమర్పించారు. భీమ్స్ సెసిరోలియో ఈ చిత్రానికి సంగీత స్వరకర్తగా ఉన్నారు.
Latest News