|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 02:57 PM
కోలీవుడ్ నటుడు ధనుష్ ఇటీవలే తన కొత్త తమిళ చిత్రం తాత్కాలికంగా 'D54' పేరుతో షూటింగ్ ప్రారంభించాడు. పోర్ థోజిల్ ఫేమ్ విగ్నేష్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క షూటింగ్ ని పూర్తి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రేమలు ఫేమ్ మామిత బైజు మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. జయరామ్, కెఎస్ రవికుమార్, సూరజ్ వెన్జరామూడు, కరునాస్, పృథ్వీ పండిరాజ్ కూడా ఈ సినిమాలో కీలకమైన తారాగణంలో భాగం. థింక్ స్టూడియోల సహకారంతో వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ కింద డాక్టర్ ఇషారీ కె. గణేష్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం స్వరపరిచారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
Latest News