|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 03:37 PM
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా పాన్-ఇండియా చిత్రం "మిరాయ్"తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ హైప్ మధ్య విడుదలైన ఈ సినిమా పాజిటివ్ సమీక్షలని అందుకుంటుంది. ఈ సినిమాలో రితిక నాయక్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమ్నేని సినిమాటోగ్రఫీ మరియు స్క్రీన్ప్లే రెండింటినీ నిర్వహించారు. ఈ చిత్రం మొదటి వారాంతాన్ని సంచలనాత్మక కలెక్షన్స్ తో పూర్తి చేసింది. మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 81.2 కోట్లు వాసులు చేసింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. టికెట్ అమ్మకాలు ఇప్పటికే అద్భుతమైనవి. సోమవారం నాడు ఈ చిత్రం 20 కోట్లు వాసులు చేస్తే బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల మార్క్ ని చేరుకుంటుంది. మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రియా సరన్, జయరం, జగపతి బాబు, శ్రీను, వెంకటేష్ మహా కూడా కీలక పాత్రల్లో నటించారు. గౌర హరి సంగీతాన్ని అందించగా, శ్రీ నాగేంద్ర తంగల కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమని టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించారు.
Latest News