|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 03:40 PM
ప్రముఖ నటుడు అథర్వా మురళి రాబోయే యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ 'టన్నెల్' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావన్య త్రిపాఠీ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. అశ్విన్ కకుమను ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కావలిసి ఉంది కానీ కొన్ని కారణాల వాళ్ళ వాయిదా పడింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కానున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, శక్తి సారావనన్ సినిమాటోగ్రాఫర్, మరియు కలైవనన్ ఎడిటర్ గా ఉన్నారు. తెలుగు వెర్షన్ రాజు నాయక్ లాచురం ప్రొడక్షన్స్ ద్వారా విడుదల అవుతుంది.
Latest News