|
|
by Suryaa Desk | Thu, Aug 21, 2025, 07:05 PM
బాలీవుడ్ నటీనటులు సిద్ధార్థ్ మల్హోత్రా మరియు జాన్వీ కపూర్ ఒక సంతోషకరమైన కామెడీ ఎంటర్టైనర్ 'పరమ సుందరి' లో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలోని డేంజర్ సాంగ్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. సచిన్ -జిగర్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ అందించగా, విశాల్ దద్లాని, పార్వతి మీనాక్షి మరియు సచిన్ -జిగర్ తమ గాత్రాలని అందించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రానికి మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ కింద దినేష్ విజయన్ నిర్మించారు. సచిన్ -జిగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. తుషార్ జలోటా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఆగస్టు 29, 2025న స్క్రీన్లను తాకనుంది.
Latest News