|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 03:11 PM
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'కూలీ' ఆగష్టు 14, 2025న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి విడుదలైన అన్ని చోట్ల మిశ్రమ సమీక్షలని అందుకుంటుంది. ప్రశంసలు అందుకున్న లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా యొక్క తెలుగు రాష్ట్రాల థియేటర్ రైట్స్ ని ఆసియాన్ సురేష్ ఎంటెర్టైన్మ్నెట్ బ్యానర్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా నైజాంలో విడుదలైన రెండవ రోజున 3 కోట్లు వాసులు చేసినట్లు ప్రకటించారు. రెండు రోజుల నైజాం కలెక్షన్స్ 7.85 కోట్లకి చేరుకున్నాయి. కూలీ అనేది స్వతంత్ర ప్రాజెక్ట్ మరియు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్సియు) కు సంబంధించినది కాదు. శ్రుతి హాసన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. సౌబిన్ షాహిర్, నాగార్జున, సత్య రాజ్, మహేంద్రన్, రెబా మోనికా జాన్ మరియు కిషోర్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అమిర్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర నిర్మాణాన్ని కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. సంగీత స్కోర్ను ప్రఖ్యాత అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు.
Latest News