|
|
by Suryaa Desk | Fri, Aug 15, 2025, 02:29 PM
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మరియు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టిఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'వార్ 2' ఆగస్టు 14, 2025న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ యాక్షన్ డ్రామా పాజిటివ్ రివ్యూస్ ని అందుకుంటుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం నైజాం రీజియన్ లో విడుదలైన తొలి రోజున 4.25 కోట్లు వాసులు చేసింది. కియారా అద్వానీ ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుండగా, బాబీ డియోల్ అతిధి పాత్రలో నటించారు. వార్ 2 అనేది హ్రితిక్ రోషన్ యొక్క 2019 స్పై థ్రిల్లర్, వార్ యొక్క సీక్వెల్. ఆదిత్య చోప్రా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ చిత్రం YRF స్పైవర్స్లో భాగం. ప్రీతమ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News