|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 05:42 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే విడుదలైన 'పుష్ప 2' తో భారీ హిట్ ని అందుకున్నాడు. ఇప్పుడు నటుడి తదుపరి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఒక ప్రాజెక్ట్ కోసం జత కట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ప్రకటన వీడియో అపారమైన సెన్సేషన్ ని సృష్టిస్తోంది. అట్లీ ఇప్పటికే ప్రాజెక్ట్ కోసం పూర్తి స్క్రిప్ట్ను పూర్తి చేసారు. ఈ చిత్రం శక్తివంతమైన డాన్ చుట్టూ తిరుగుతుంది మరియు మాఫియా నేపథ్యం ఉంది అని సమాచారం. దీపికా పాడుకొనే, మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటిస్తున్నారు. ఈ సినిమా 800 కోట్ల బడ్జెట్ లో రూపొందుతుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో ఒక సిస్టర్ రోల్ కోసం మేకర్స్ సీనియర్ నటి కోసం వెతుకుతున్నట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్స్ లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
Latest News