|
|
by Suryaa Desk | Sat, Aug 09, 2025, 07:38 PM
కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే తన కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'కిష్కీందపురి' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. హర్రర్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని ఉండిపోవే నాతోనే అనే టైటిల్ తో విడుదల చేసారు. చైతన్ భరత్త్వాజ్కంపోస్ చేసిన ఈ సాంగ్ కి పూర్ణ చారీ లిరిక్స్ అందించగా, జావేద్ అలీ తన గాత్రాణి అందించారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ వన్ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గరిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరత్త్వాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. శ్రీమతి షైన్ స్క్రీన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం. 8ని అర్చన సమర్పిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది.
Latest News