|
|
by Suryaa Desk | Sat, Aug 09, 2025, 07:34 PM
బబుల్ గమ్ ఫేమ్ రోషన్ కనకాలా తన తదుపరి చిత్రాన్ని కలర్ ఫోటోకు పేరుగాంచిన యువ దర్శకుడు సందీప్ రాజ్ తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'మోగ్లీ 2025' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్ ని క్రియేట్ చేస్తోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్న సాక్షి మహాదోల్కార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. అంతేకాకుండా ఈ సినిమాలో నటి జాస్మిన్ అనే పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో సాక్షి మహాదోల్కార్ నటిస్తుంది. ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్, హర్ష కీలక పాత్రలలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ క్రింద టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీత దర్శకుడుగా ఉన్నారు. రామమూర్తి, పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాలను నిర్వహిస్తున్నారు.
Latest News