|
|
by Suryaa Desk | Sat, Aug 09, 2025, 04:45 PM
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ హంక్ హ్రితిక్ రోషన్ తో కలిసి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పై థ్రిల్లర్ 'వార్ 2' లో స్క్రీన్ను పంచుకోనున్నారు. చిత్ర బృందం ఇటీవలే విడుదల చేసిన వార్ 2 ప్రమోషనల్ కంటెంట్ మూవీ పై భారీ హైప్ ని సృష్టించింది. ఈ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా భారీగా 7,500 స్క్రీన్లలో విడుదల అవుతుంది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా యొక్క బుకింగ్స్ ఆగష్టు 10న అంటే ఆదివారం ఓపెన్ కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ హై-బడ్జెట్ ఎంటర్టైనర్లో కియారా అద్వానీ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ చిత్రం YRF స్పైవర్స్లో భాగం. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ ట్రీట్గా థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రీతమ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆదిత్య చోప్రా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వార్ 2 అనేది హ్రితిక్ రోషన్ యొక్క 2019 స్పై థ్రిల్లర్, వార్ యొక్క సీక్వెల్.
Latest News