|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 02:20 PM
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ భారీ స్థాయిలో దర్శకత్వం వహించిన తెలుగు చిత్రాలలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఘాటి' ఒకటి. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే చిత్ర బృందం ఈ సినిమా యొక్క ట్రైలర్ ని తెలుగు మరియు తమిళంలో విడుదల చేసింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో 3 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఘాటీ చిత్రం సెప్టెంబర్ 5, 2025న పెద్ద స్క్రీన్లపైకి రానుంది. ఘాతీ పాన్-ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి విద్య సాగర్ సంగీతాని అందిస్తున్నారు.
Latest News