|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 02:00 PM
తమిళ బ్లాక్బస్టర్ గరుడన్ యొక్క అధికారిక తెలుగు రీమేక్ 'భైరవం' పేరుతో మే 30న విడుదల అయ్యింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్ మరియు నారా రోహిత్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ సినిమా జీ తెలుగు ఛానల్ లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా తొలి టెలికాస్ట్ లో 5.47 టీఆర్పీని నమోదు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో అదితి శంకర్, దివ్య పిళై, ఆనంది కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్, అజయ్, శరత్, జయసుధ, సంపత్ రాజ్, గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ హరి కె వేదాంతం, మ్యూజిక్ కంపోజర్ శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి ఉన్నారు. ఈ చిత్రానికి సంభాషణలు సత్యర్షి మరియు తూమ్ వెంకట్ అందించగా, భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ మరియు తిరుపతి సాహిత్యం అందించారు.పెన్ స్టూడియోస్కు చెందిన డాక్టర్ జయంతిలాల్ గదా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Latest News