|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 07:46 AM
క్రిష్ జగర్లముడి దర్శకత్వంలో ప్రముఖ నటి అనుష్క శెట్టి రాబోయే చిత్రం 'ఘాటీ' లో కనిపించనుంది. ఈ సినిమా ఈ సంవత్సరం అత్యంత ఉహించిన ప్రాజెక్టులలో ఒకటి. ఈ చిత్రం త్వరలో విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమా పై భారీ బజ్ ఉంది. ఇటీవలే మేకర్స్ విడుదల చేసిన ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ కి భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని ఆగష్టు 6న సాయంత్రం 4:45 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రాకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నారు. UV క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి విద్యా సాగర్ స్వరపరిచిన సంగీతం ఉంది.
Latest News