|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 07:42 AM
సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు లోకేష్ కనగరాజ్ యొక్క 'కూలీ' ఆగస్టు 14 నుండి విడుదలకి సిద్ధంగా ఉంది. శ్రుతి హాసన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. సౌబిన్ షాహిర్, నాగార్జున, సత్య రాజ్, మహేంద్రన్, రెబా మోనికా జాన్ మరియు కిషోర్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అమిర్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమినీ టీవీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకి రివ్యూస్ సానుకూలంగా ఉంటే ఈ చిత్రం తమిళ సినిమాలో ఆల్ టైమ్ రికార్డులను బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. సెన్సార్ ఫార్మాలిటీలు పూర్తయ్యాయి మరియు ఈ చిత్రానికి 'A' సర్టిఫికేట్ లభించింది. ఈ చిత్ర నిర్మాణాన్ని కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. సంగీత స్కోర్ను ప్రఖ్యాత అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు.
Latest News