![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 06:20 PM
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’ . వశిష్ఠ దర్శకుడు. త్రిష కథానాయిక. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఇటీవల చిరంజీవి సీజీ అవుట్పుట్లో 45 నిమిషాల భాగాన్ని చూశారట. ఇది ఆయనకు బాగా నచ్చడంతో తన సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి ఒక స్పెషల్ సాంగ్ మరియు కొన్ని రోజుల ప్యాచ్వర్క్ మినహా చిత్రీకరణ పూర్తయిందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది.ఈ స్పెషల్ సాంగ్కు భీమ్స్ సంగీతం అందించనున్నారు. అయితే ఇది రీమిక్స్ సాంగ్ కాదు. పూర్తిగా కొత్త పాట. కేజీఎఫ్లోని ‘గాలి గాలి’ పాటతో మెప్పించిన నటి మౌనీ రాయ్ ఈ పాటతో తెలుగు సినిమాలోకి అడుగుపెట్టబోతున్నారు. ‘బింబిసార’ చిత్రంతో ఫాంటసీ జానర్లో తనను తాను నిరూపించుకున్న మల్లిడి వశిష్ట ఈ సోషియో ఫాంటసీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన సెప్టెంబర్లో ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Latest News