![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 08:35 AM
టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన 38వ చిత్రం కోసం సంపత్ నందితో కలిసి పని చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియన్ సినిమాకి మూవీ మేకర్స్ 'భోగి' అని టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మరియు డింపుల్ హయతి ప్రముఖ మహిళ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ని జరుపుకుంటుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ రాధా మోహన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా సెట్స్ లో సెలెబ్రేట్ చేసారు. ఈ సెలెబ్రేషన్స్ కి సంబందించిన చిత్రాలని మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ భారీ చిత్రం 1960 లలో ఉత్తర తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతంలో పాతుకుపోయిన పాతకాలపు అమరికతో ఉంది. కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్టర్ కాగా, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ మరియు ఎడిటర్ గురించి వివరాలు త్వరలో ప్రకటించబడతాయి. ఈ ప్రాజెక్టును సీనియర్ నిర్మాత కెకె రాధాహన్ శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు మరియు లక్ష్మి రాధమోహన్ సమర్పించారు.
Latest News