![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 09:32 AM
మంచు విష్ణు తన కలల ప్రాజెక్ట్ అయిన 'కన్నప్ప' చిత్రం విడుదల సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ క్షణం రానే వచ్చిందంటూ, సోషల్ మీడియా వేదికగా తన మనసులోని మాటను పంచుకున్నారు. ఈ సినిమాపై వస్తున్న స్పందన పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.నేడు 'కన్నప్ప' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా మంచు విష్ణు 'ఎక్స్' లో ఒక పోస్ట్ చేశారు. "ఈ క్షణం నా జీవితాంతం దీని కోసమే ఎదురుచూశాను" అంటూ తన ట్వీట్ను ఎంతో ఉద్వేగభరితంగా ప్రారంభించారు. భారత్లో ఉదయం ఆటలతో పాటు, విదేశాల్లోని ప్రీమియర్ షోల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన, ప్రేమ తన హృదయాన్ని కృతజ్ఞతతో నింపేసిందని ఆయన పేర్కొన్నారు.ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అంకితమిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. "'కన్నప్ప' ఇకపై కేవలం నా సినిమా మాత్రమే కాదు. ఇది ఇప్పుడు మీ అందరిది" అని విష్ణు తన పోస్టులో పేర్కొన్నారు. అభిమానులు చూపిస్తున్న ఆదరణకు ప్రతిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చివరగా "హర్హర్మహాదేవ్" అనే హ్యాష్ట్యాగ్తో తన పోస్టును ముగించారు.మంచు విష్ణు కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భారీ బడ్జెట్తో 'కన్నప్ప' తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా విడుదల రోజున హీరో చేసిన ఈ భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అభిమానులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.
Latest News