|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 08:35 AM
ప్రముఖ డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో మ్యాడ్ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ '8 వసంతాలు' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవల విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై భారీ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమాని మేకర్స్ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 17న అంటే ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో నటి శుద్ధి అయోధ్య అనే మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలిగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సాంకేతిక సిబ్బందిలో అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైనర్గా, శశాంక్ మాలి ఎడిటర్గా మరియు బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. యాక్షన్ కొరియోగ్రఫీని వింగ్ చున్ అంజి నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. ప్రఖ్యాత పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ కంటెంట్-ఆధారిత చిత్రాన్ని నిర్మిస్తుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.
Latest News