|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 06:33 PM
ప్రశంసలు పొందిన దర్శకుడు పూరి జగన్నాద్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతితో జత కట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో జాతీయ అవార్డు గెలుచుకున్న నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు రాధికా ఆప్టే, విద్య బాలన్, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్ర కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలతో త్వరలో లో ప్రొడక్షన్ ప్రారంభం కానుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆన్ బోర్డు అనౌన్స్మెంట్ ని రేపు ఉదయం 10:12 గంటలకి రివీల్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి 'భవతి భిక్షందేహి' అనే శీర్షికను పెట్టాలని మేకర్స్ పరిశీలిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం మరియు హిందీలతో సహా పలు భాషలలో విడుదల అవుతుంది. ఈ చిత్ర సంగీతాన్ని మెలోడీ బ్రహ్మ మణి శర్మ కుమారుడు మహతి స్వర సాగర్ స్వరపరుస్తున్నారు. ఈ చిత్రానికి పూరి జగన్నద్ నటి-నిర్మాత ఛార్మి కౌర్తో కలిసి నిర్మించనున్నారు.
Latest News