|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 03:36 PM
కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టు కాంతార చాప్టర్ 1కి వరుస ప్రమాదాలు జరుగుతుండటం చిత్ర బృందాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ చిత్రంలో నటిస్తున్న జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న వ్యాన్ గత ఏడాది ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ చిత్రంలో నటిస్తున్న కపిల్ అనే నటుడు నదిలో కొట్టుకుపోయి మృతి చెందాడు.అదే నెలలో రాకేశ్ పూజారి అనే మరో నటుడు గుండెపోటుతో చనిపోగా, మొన్న మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నిజూ (43) గుండెపోటుతో కన్నుమూశాడు. ఈ విషాద ఘటనలు మరువకముందే మరో ప్రమాదం జరిగింది. తాజాగా జరిగిన బోటు ప్రమాదంలో నటుడు రిషబ్ శెట్టి కూడా ఉన్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద జరుగుతుండగా, షూటింగ్లో పాల్గొన్న నటుడు రిషబ్ శెట్టితో పాటు 30 మంది ఆర్టిస్టులు కలిసి ప్రయాణిస్తున్న బోటు ప్రమాదానికి గురైనట్లు సమాచారం.దీంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో కెమెరాతో పాటు సాంకేతిక పరికరాలు కొట్టుకుపోగా, రిషబ్తో పాటు పలువురు నటులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
Latest News