![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 06:39 PM
కోలీవుడ్ హీరోయిన్ జ్యోతిక ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే హీరో సూర్యను పెళ్లిచేసుకొని సినిమాలకు గ్యాప్ ఇచ్చిన జ్యోతిక.. గత కొంతకాలంగా నటించడం మొదలుపెట్టింది. ఇక సూర్య ఫ్యామిలీ చెన్నై నుంచి ముంబైకి షిఫ్ట్ అవ్వడంతో.. బాలీవుడ్ లో జ్యోతికకు వరుస సినిమాలు తలుపుతడుతున్నాయి. సైతాన్, శ్రీకాంత్, డబ్బా కార్టెల్ లాంటి సినిమాల్లో జ్యోతిక నటించి మెప్పించింది. ముఖ్యంగా డబ్బా కార్టెల్ సిరీస్ లో ఆమెకు తగ్గ పాత్ర కాదని కొందరు విమర్శించినా.. జ్యోతిక వచ్చిన అవకాశాలను వదులుకోవాలని అనుకోవడంలేదని, అందుకే ఏ ఛాన్స్ వచ్చినా మిస్ కాకుండా ఒడిసిపట్టుకుంటుందని టాక్. ఇక తాజాగా జ్యోతిక మరో బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ పట్టేసింది. ఈ మధ్యకాలంలో కోర్టు డ్రామాలు మంచి ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తున్నాయి. జ్యోతిక కూడా ఒక అద్భుతమైన కోర్టు డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.బరేలి కీ బర్ఫీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అశ్విన్ అయ్యారు తివారీఈ కోర్టు డ్రామాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ సినిమాలో జ్యోతికతో పాటు బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. వీరిద్దరూ కోర్టులో నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్లాడుకొనేలా వాదించుకుంటారని తెలుస్తోంది. అందులో కూడా భావోద్వేగాలు తగ్గకుండా డైరెక్టర్ తెరకెక్కించనున్నాడట. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అమెజాన్ లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాతో ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లకు ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి.
Latest News