![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 07:09 PM
భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యొక్క హై-బడ్జెట్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'స్పిరిట్' ఒకటి. స్పిరిట్ ప్రభాస్ సిల్వర్ జూబ్లీ ఫిల్మ్. ఈ సినిమా రానున్న మూడు నెలలో ప్రొడక్షన్ ఫార్మాలిటీలను ప్రారంభిస్తుందని చిత్ర నిర్మాత భూషణ్ కుమార్ ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్, ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో గ్లామర్ బ్యూటీ త్రిప్తి దిమిరి నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. సందీప్ తన భద్రాకలి పిక్చర్స్ బ్యానర్ కింద ఈ చిత్రాన్ని సహ-నిర్మించాడు. టి-సిరీస్కు చెందిన బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ఈ ప్రాజెక్టును బ్యాంక్రోలింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం హర్షవర్ధన్ రమేశ్వర్ అందిస్తున్నారు.
Latest News