![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 06:42 PM
ప్రఖ్యాత 'మైసూరు శాండల్' సబ్బుల తయారీ సంస్థ, కర్ణాటక ప్రభుత్వ ఆధీనంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కేఎస్డీఎల్), తమ మార్కెట్ను మరింత విస్తరించుకునే లక్ష్యంతో నటి తమన్నాతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సబ్బుల ప్రచారకర్తగా వ్యవహరించేందుకు తమన్నాతో రూ.6.2 కోట్ల విలువైన కాంట్రాక్టుపై సంతకాలు చేసింది. అయితే, కన్నడ నటీమణులను కాదని తమన్నాను ఎంచుకోవడంపై సామాజిక మాధ్యమంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, తమన్నాతో కుదిరిన ఈ ఒప్పందం రెండేళ్ల రెండు రోజుల పాటు అమలులో ఉంటుంది. ఈ ఒప్పందం కోసం కర్ణాటక పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పారదర్శకత చట్టం (కేటీపీపీ) సెక్షన్ 4(జి) కింద కేఎస్డీఎల్కు మినహాయింపు కూడా ఇచ్చారు. దీని ద్వారా నటికి రూ.6.2 కోట్లను నేరుగా చెల్లించేందుకు వీలు కల్పించారు.
Latest News