![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 03:59 PM
తెలుగు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాబోయే చిత్రం 'భైరవం' లో కనిపించనున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించగా, పెన్ స్టూడియోస్ పతాకంపై డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పిస్తున్నారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని గ్రాండ్ ఈవెంట్ లో విడుదల చేసారు. తాజగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ 7 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. నారా రోహిత్ మరియు మనోజ్ మంచు కూడా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది మరియు దివ్య పిళ్లై మహిళ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్, అజయ్, శరత్, జయసుధ, సంపత్ రాజ్, గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ హరి కె వేదాంతం, మ్యూజిక్ కంపోజర్ శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి ఉన్నారు. ఈ చిత్రానికి సంభాషణలు సత్యర్షి మరియు తూమ్ వెంకట్ అందించగా, భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ మరియు తిరుపతి సాహిత్యం అందించారు. ఈ చిత్రం మే 30న విడుదల కానుంది. ఈ చిత్రం తమిళ బ్లాక్బస్టర్ గరుడన్ యొక్క అధికారిక తెలుగు రీమేక్.
Latest News