![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 08:01 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు' విడుదలకు శరవేగంగా సిద్ధమవుతోంది. సినిమా చిత్రీకరణ పూర్తయిందని, వారం రోజుల్లో సెన్సార్ బోర్డుకు పంపనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మొదటి భాగం 'హరి హర వీర మల్లు: పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్'ను జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా విశేషాలను దర్శకుడు ఏ.ఎం. జ్యోతికృష్ణ పంచుకున్నారు. "సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. వారం రోజుల్లో సెన్సార్ క్లియరెన్స్ కోసం దరఖాస్తు చేస్తాం. మొత్తం 200 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం," అని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నారు.
Latest News