![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 06:04 PM
రాధా కృష్ణ రెడ్డి దర్శకత్వంలో కిరీటి మరియు శ్రీలీల ప్రధాన పాత్రలలో 'జూనియర్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ యూత్ ప్రేమకథ పాన్-ఇండియన్ గా విడుదల కానుంది. ఈ చిత్రం జూలై 18, 2025న గొప్ప థియేట్రికల్ విడుదల కోసం సిద్ధంగా ఉంది. మేకర్స్ ఈ సినిమా సంగీత ప్రమోషన్లను కిక్స్టార్ట్ చేశారు. ఇటీవలే చిత్ర బృందం ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ని లెట్స్ లైవ్ థిస్ మూమెంట్ అనే టైటిల్ తో విడుదల చేసింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ ట్రాక్ కి జాస్ప్రీత్ జాస్జ్ తన గాత్రాణి అందించారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ 5 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ప్రతిష్టాత్మక వారాహి చలానా చిత్రం బ్యానర్ ఆధ్వర్యంలో రజనీ కొర్రాపతి నిర్మించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రవిచంద్రన్ మరియు జెనీలియా కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News