![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 04:34 PM
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవలే 'టూరిస్ట్ ఫ్యామిలీ' అనే చిత్రాన్ని చూసి, ఓ అద్భుతమైన సినిమా అంటూ ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ సుందర్ కూడా చేరారు. ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని, హృదయాన్ని స్పృశించిందని ఆమె పేర్కొన్నారు."ఈ రోజు ఓ అద్భుతమైన, హృదయాన్ని హత్తుకునే సినిమా చూశాను. దాని పేరు 'టూరిస్ట్ ఫ్యామిలీ'. సినిమా చాలా సరళంగా ఉంది. మనసు పెట్టి తీశారు. ఇది హృదయం, బుద్ధి రెండూ సరైన స్థానంలో ఉంచి తీసిన చాలా సింపుల్ సినిమా" అని ఆమె తెలిపారు.సినిమాలోని నటీనటుల ప్రదర్శనను కూడా కుష్బూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. "శశికుమార్, సిమ్రాన్ తో పాటు మిగతా నటీనటులందరూ తమ పాత్రల్లో జీవించారు" అని ఆమె కొనియాడారు. ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని ఆమె అన్నారు.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అభిషన్ జీవింత్ మరియు చిత్ర బృందానికి కుష్బూ అభినందనలు తెలిపారు. "ఈ భారీ విజయానికి దర్శకుడు అభిషన్ జీవింత్ గారికి, చిత్ర బృందానికి నా అభినందనలు. మీరు మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను" అని ఆమె ఆకాంక్షించారు.ప్రముఖులు వరుసగా ఈ సినిమాను ప్రశంసిస్తుండడంతో 'టూరిస్ట్ ఫ్యామిలీ' చిత్రంపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది. ఈ చిత్రం మే 1న థియేటర్లలోకి వచ్చింది.
Latest News