|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 06:35 PM
శశాంక్ ఖితాన్ దర్శకత్వంలో ప్రసిద్ధ బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన 'సన్నీ సంస్కరి కి తుల్సీ కుమారి' చిత్రం అక్టోబర్ 2న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిశ్రమ సమీక్షలని అందుకుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదలైన 5 రోజులలో 35.37 కోట్ల గ్రాస్ ని వాసులు చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో గార్జియస్ బాలీవుడ్ నటి జాన్వి కపూర్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో సన్యా మల్హోత్రా, అక్షయ్ ఒబెరాయ్, రోహిత్ సారాఫ్, మనీష్ పాల్ మరియు ఇతరులు ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు. కరణ్ జోహార్ అతని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ ఆధ్వర్యంలో ఈ సినిమాని నిర్మించారు.
Latest News