|
|
by Suryaa Desk | Fri, Oct 03, 2025, 07:59 PM
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' సూపర్ హిట్ గా నిలిచింది. దీపికా పదుకొనే, కమల్ హాసన్ మరియు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించిన ఈ పౌరాణిక వైజ్ఞానిక కల్పన వరల్డ్ బాక్సాఫీస్ వద్ద 1100 కోట్లు వసూలు చేసింది. రాజేంద్ర ప్రసాద్, దిశా పటాని, శాశ్వత ఛటర్జీ, బ్రహ్మానందం, అన్నా బెన్, శోభన, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ మరియు విజయ్ దేవరకొండ కూడా కీలక పాత్రల్లో నటించారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కి పనిచేస్తున్నాడు. ఈ చిత్రం షూట్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా నుండి దీపికా పదుకొనె తొలగించబడింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్ర కోసం మేకర్స్ సాయి పల్లవి ని సెలెక్ట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వస్తున్నాయి. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ మెగా-బ్లాక్బస్టర్కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
Latest News