![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 12:39 PM
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఉట్కూర్ మండలంలోని పెద్దపొర్లలో నూతన గ్రామ పంచాయతి కార్యాలయాన్ని బుధవారం మంత్రి డా. వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలనలో గ్రామాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.