![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 12:39 PM
కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించిన విచారణలో భాగంగా మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బీఆర్కే భవన్లోని కమిషన్ ముందు హాజరయ్యారు. గతంలో ఆయన నిర్వహించిన బాధ్యతలకు సంబంధించి కమిషన్ ఆయనను పలు ప్రశ్నలు అడగనుందని తెలుస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆర్థిక అంశాలపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాజెక్ట్ నాణ్యతను పరిశీలించకముందే నిధులు ఎలా విడుదల చేశారనే కీలక ప్రశ్నలను ఈటల ఎదుర్కోనున్నట్లు సమాచారం. కమిషన్ ఈ విషయంలో లోతైన విచారణ జరుపుతోంది.