![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 11:32 AM
కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. గతంలో ఆయన నిర్వహించిన బాధ్యతల ఆధారంగా కమిషన్ ఆయనను పలు ప్రశ్నలు అడగనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుల ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రశ్నలను కమిషన్ రెడీ చేసింది. ప్రాజెక్ట్ నాణ్యత చెక్ చేయకముందే ఎలా నిధులు విడుదల చేశారనే ప్రశ్నలు ఈటల ఎదుర్కోనున్నారని సమాచారం.