![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 12:40 PM
హాలియా పట్టణంలో హిందూ సామ్రాజ్య వాద దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఆర్యక్షత్రియ సంఘం మరియు ఛత్రపతి శివాజీ యూత్ కమిటీ సంయుక్తంగా నిర్వహించాయి.
ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రముఖ వక్త శివన్నారాయణ మాట్లాడుతూ, "ప్రపంచంలో తొలి హైందవ సింహాసనాదీసుడు ఛత్రపతి శివాజీ మహారాజ్" అని కొనియాడారు. శివాజీ మహారాజ్ రాజ్యభిషేకం ద్వారా హిందూ స్వాభిమానం ఎలా మేల్కొన్నదీ, ఆయన పరిపాలన, ధైర్య సాహసాలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయనీ చెప్పారు.
కార్యక్రమంలో ఆర్యక్షత్రియ సంఘం అధ్యక్షులు ముజ్జా శివరామయ్య, సంఘ సభ్యులు, యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వారు శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక యువత కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై దేశభక్తి సందేశాన్ని ప్రచారం చేశారు. ఈ విధంగా హాలియాలో హిందూ సామ్రాజ్య దినోత్సవం ఉత్సాహంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.