|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 12:36 PM
పాలకుర్తి మండలం కేంద్రంలోనీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసిడింగ్ పత్రాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాలకుర్తి మండలంలో 304 మందికి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు ఇవ్వడం జరిగిందని ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఎవరు ఏ పార్టీ అనేది చూడకుండా.. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఈ సందర్భంగా తెలిపారు.