|
|
by Suryaa Desk | Tue, Sep 09, 2025, 03:20 PM
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా రాబోయే పాన్-ఇండియా చిత్రం "మిరాయ్"తో మరోసారి ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి భారీ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా యాక్షన్ సినిమా ఔత్సాహికులు మరియు సాధారణ వీక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క కోచి టూర్ వివరాలని వెల్లడించారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి క్రౌన్ ప్లాజా లో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రితిక నాయక్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో శ్రియ శరన్, జగపతి బాబు, జయ రామ్ మరియు ఇతరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రంకి కార్తీక్ ఘట్టమ్నేని సినిమాటోగ్రఫీ మరియు స్క్రీన్ప్లే రెండింటినీ నిర్వహిస్తున్నారు. "మిరాయ్" సెప్టెంబర్ 12, 2025న 8 భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. గౌర హరి సంగీతాన్ని అందించగా, శ్రీ నాగేంద్ర తంగల కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
Latest News