|
|
by Suryaa Desk | Mon, Sep 08, 2025, 02:37 PM
టాలీవుడ్ స్టార్ హీరో రవి తేజా త్వరలో 'మాస్ జాతర' అనే సినిమాతో ప్రేహకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా నటుడు కిషోర్ తిరుమాల దర్శకత్వంలో తన 76వ చిత్రాన్ని ప్రాకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ జీ తెలుగు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రవి తేజకి జోడిగా విశ్వంభర బ్యూటీ ఆషిక రంగనాథన్ నటిస్తుంది. ఈ సినిమాకి ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మురెల్లా మరియు ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా ఉన్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ కింద సుధాకర్ చెరుకురి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ కంపోజర్ గా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ సీజన్లో ఈ చిత్రం విడుదల కానుంది.
Latest News