|
|
by Suryaa Desk | Sun, Sep 07, 2025, 07:52 PM
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తన కెరీర్ విషయంలో ఓ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు నటిగా బిజీగా ఉంటూనే, కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చే ఆమె, తన గారాల పట్టి రాహా కోసమే ఈ మార్పు చేసుకోబోతున్నట్టు వెల్లడించారు. భవిష్యత్తులో తాను నటించే సినిమాల జోనర్ను పూర్తిగా మార్చనున్నట్లు స్పష్టం చేశారు.ఇప్పటివరకు 'గంగూబాయి కతియావాడి', 'రాజీ' వంటి సీరియస్ చిత్రాలతో నటిగా ఎన్నో ప్రశంసలు అందుకున్న అలియా, ఇకపై తేలికపాటి కామెడీ కథలను ఎంచుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. దీనికి ప్రధాన కారణం తన కుమార్తె రాహా అని ఆమె పేర్కొన్నారు. "ఇప్పటివరకు నా కూతురు రాహా చూసి ఆనందించే ఒక్క సినిమా కూడా నేను చేయలేదు. అందుకే భవిష్యత్తులో తను చూసి నవ్వుకునేలాంటి ఒక సినిమా ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నా. నా కూతురే నా జోనర్ మార్పుకు కారణం. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులను అంగీకరించాను, వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను" అని అలియా వివరించారు.
Latest News