|
|
by Suryaa Desk | Thu, Sep 04, 2025, 02:59 PM
టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని యొక్క కొత్త చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా' చిత్రంతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క మ్యూజిక్ ప్రమోషన్స్ ని ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని పప్పీ షేమ్ అనే టైటిల్ తో సెప్టెంబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమా లో కన్నడ నటుడు ఉపేంద్ర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ కి జోడిగా భాగ్య శ్రీ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో రావు రమేష్, మురలి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్ మరియు ఇతర ప్రముఖ నటులు కూడా ఉన్నారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైథ్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో వివేక్ మరియు మార్విన్ కంపోజ్ చేసిన సంగీతం ఉంది. ఈ చిత్రం నవంబర్ 28న విడుదల కానుంది.
Latest News