|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 07:11 PM
టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే తన కొత్త ప్రాజెక్ట్ ని కౌశిక్ పెగళ్లపాటితో ప్రకటించారు. ఈ చిత్రానికి 'కిష్కీందపురి' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని ఆగష్టు 15న సాయంత్రం 4:05 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రాకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ప్రతిభావంతులైన అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. శ్రీమతి షైన్ స్క్రీన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం. 8ని అర్చన సమర్పిస్తున్నారు. నిరంజన్ దేవరమానే ఈ చిత్రానికి ఎడిట్ చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గరిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News