|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 04:47 PM
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'కూలీ' ఆగష్టు 14, 2025న గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యాక్షన్, సస్పెన్స్ మరియు ఆకట్టుకునే కథాంశంతో కూడిన థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్ను సృష్టించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా బుక్ మై షో పోర్టల్ లో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. శ్రుతి హాసన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. సౌబిన్ షాహిర్, నాగార్జున, సత్య రాజ్, మహేంద్రన్, రెబా మోనికా జాన్ మరియు కిషోర్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అమిర్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. ప్రశంసలు అందుకున్న లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సంగీత స్కోర్ను ప్రఖ్యాత అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు. ఈ చిత్ర నిర్మాణాన్ని కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు.
Latest News