|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 09:27 PM
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా రాబోయే పాన్-ఇండియా చిత్రం "మిరాయ్"తో మరోసారి ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా గ్లింప్సె మరియు ఫస్ట్ సింగల్ కి భారీ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా యాక్షన్ సినిమా ఔత్సాహికులు మరియు సాధారణ వీక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని ప్రారంభించారు. ప్రధాన నటుడు తేజ సజ్జా కన్నడ మీడియాకు ఇంటర్వూస్ ని ఇస్తున్నాడు. మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రితిక నాయక్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంకి కార్తీక్ ఘట్టమ్నేని సినిమాటోగ్రఫీ మరియు స్క్రీన్ప్లే రెండింటినీ నిర్వహిస్తున్నారు. "మిరాయ్" సెప్టెంబర్ 5, 2025న 8 భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ చిత్రం 2D మరియు 3D ఫార్మాట్లలో సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది. ఈ సినిమాకి మణిబాబు కరణం డైలాగ్స్ రాశారు. గౌర హరి సంగీతాన్ని అందించగా, శ్రీ నాగేంద్ర తంగల కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
Latest News