|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 03:32 PM
బబ్లీ నటి అనుపమ పరమేశ్వరన్ తన తదుపరి చిత్రాన్ని ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'పరధా' అనే టైటిల్ ని లాక్ చేసారు. తెలుగు, మలయాళం రెండు భాషల్లోనూ ఆగష్టు 22న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాని మేకర్స్ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క రాజమండ్రి మరియు కాకినాడ ప్రమోషనల్ టూర్ వివరాలని విడుదల చేసారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో అనుపమతో కలిసి దర్శన రాజేంద్రన్, సంగీత క్రిష్ మరియు రాగ్ మయూర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసులు పి, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మించారు.
Latest News