|
|
by Suryaa Desk | Sat, Aug 09, 2025, 05:18 PM
ప్రముఖప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ కన్నడ హిట్ సినిమా 'సు ఫ్రామ్ సో' ఆగష్టు 8న తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసింది. ఈ సినిమాకి తెలుగురాష్ట్రాలలో విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాకి ఉన్న డిమాండ్ కారణంగా తెలుగురాష్ట్రాలలో అదనపు స్క్రీన్స్ ని జోడిస్తున్నట్లు మేకర్స్ ప్రాకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. తన లైట్ బుద్ధ ఫిలిం బ్యానర్ కింద రాజ్ బి శెట్టి ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రంలో షానెల్ గౌతమ్, జె.పి. తుమినాడ్, సంధ్య అరాకేరే, ప్రకాష్ తుమినాడ్, దీపక్ రాయ్ పనాజే, మరియు మైమ్ రామ్దాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Latest News