|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 08:26 PM
ప్రముఖ మలయాళం నటి అనుపమ పరమేశ్వరన్ తన తదుపరి చిత్రాన్ని ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'పరధా' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ లఢక్ లో జరుగుతుంది. ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఆగష్టు 9న సాయంత్రం 4:30 గంటలకి నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. తాజాగా ఇప్పుడు ఈ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్లు మేకర్స్ ప్రాకటించారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో అనుపమతో కలిసి దర్శన రాజేంద్రన్, సంగీత క్రిష్ మరియు రాగ్ మయూర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసులు పి, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మించారు. తెలుగు, మలయాళం రెండు భాషల్లోనూ ఆగష్టు 22న విడుదలకు సిద్ధంగా ఉంది.
Latest News